- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం యాసంగి సాగు పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని ఏఈఓ సౌమ్య చేపట్టారు. మద్నూర్, అవల్గావ్, వాడి ఫతేపూర్ గ్రామాల యాసంగి పంటల సాగు పై రైతుల నుంచి సాగు పంట వివరాలు నమోదు చేయడం జరిగిందని ఏఈవో సౌమ్య తెలిపారు. ఈ శివారులోని రైతులు ఇంకా ఎవరైనా సాగు పంట వివరాలు నమోదు చేసుకోని వారుంటే వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
- Advertisement -



