Wednesday, July 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీ నదిలో ఆక్రమణల తొలగింపు

మూసీ నదిలో ఆక్రమణల తొలగింపు

- Advertisement -

– చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి నుంచి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు..
– గతంలో వాటిపై హైకోర్టు సీరియస్‌
– కేసులున్నా అక్రమ వ్యాపారాల కొనసాగింపు
– రంగంలోకి దిగి తొలగించిన హైడ్రా
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఎంజీబీఎస్‌, హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి పరిసరాల మధ్యలో ఉన్న మూసీ నది గర్భంలో.. 20 నుంచి 25 మీటర్ల మేర మట్టిని నింపి చేపట్టిన అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా తొలగించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తి చేసింది. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్‌ వేసి 9.62 ఎకరాల భూమిని కాపాడింది. వాహనాల పార్కింగ్‌, పండ్లను నిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల ఏర్పాటుతోపాటు నర్సరీ పేరిట నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారానికి హైడ్రా అడ్డుకట్ట వేసింది. మూసీ ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. షెడ్డులు వేసుకుని నివాసముంటున్న వారి విషయంలో ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడింది.

కోర్టు ధిక్కరణ కేసులున్నా కొనసాగిన కబ్జాలు
తికారం సింగ్‌ అనే వ్యక్తి 3.10 ఎకరాల మేర కబ్జా చేశారు. 1.30 ఎకరాల మేర పూనమ్‌చాంద్‌ యాదవ్‌ ఆక్రమించారు. 5.22 ఎకరాల మేర జయకృష్ణ కబ్జా చేశారు. వీరిపై కోర్టు ధిక్కరణ కేసులు కూడా ఉన్నాయి. ఈ కబ్జాలపై హైకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు నాటి హైదరాబాద్‌ కలెక్టర్‌ వారిపై కేసులు పెట్టారు. అయినా కబ్జాల పర్వం కొనసాగించారు. వాహనాల పార్కింగ్‌కు వినియోగించారు. పండ్లను నిల్వ చేసేందుకు ఫ్రీజర్లు కూడా ఏర్పాటు చేశారు. నర్సరీని కొంతమేర పెంచి వ్యాపార దందా కొనసాగిస్తున్నారు. అక్కడ కార్యాలయాల నిమిత్తం చిన్న షెడ్డులు కూడా నిర్మించారు. ఒక్కో వాహనానికి రోజుకు రూ.300 వరకు వసూలు చేసి బస్సులు, లారీల పార్కింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. నదీ గర్భంలో ఆక్రమణలతో వ్యాపారాలు చేయడమే కాకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పరిసర ప్రాంతాల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -