Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూల్ బాగ్ ఇండ్లు కబ్జా కాకుండా కాపాడాలని కలెక్టర్ కు వినతి..

పూల్ బాగ్ ఇండ్లు కబ్జా కాకుండా కాపాడాలని కలెక్టర్ కు వినతి..

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ : గన్ ఫౌండ్రి డివిజన్ పరిధిలోని పూల్ బాగ్ లో నిర్మించిన ఇండ్లు కబ్జాకు గురవ్వకుండా కాపాడాలని టీపీసీసీ మీడియా కో-ఆర్డినేటర్ కె శ్రీకాంత్ యాదవ్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసి కోరారు.  ఆయన పూల్ బాగ్ వాసులతో కలిసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2010 సంవత్సరంలో గన్ ఫౌండ్రి డివిజన్ పరిధిలోని పూల్ బాగ్ బస్తీలో అప్పటి మంత్రి ముఖేష్ గౌడ్ పేదలకు 608 ఇండ్లు పేదలకు కేటాయించారని శ్రీకాంత్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. వాటిలో 579 మంది లబ్దిదారులకు ఇండ్లను మంజూరు చేస్తూ పత్రాలను సైతం అందజేసినట్లు వివరించారు. ఇండ్లు మంజురు చేసిన ఇండ్లు కబ్జాలకు గురి కాకుండా, లబ్ది దారులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. దీంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సానుకూలంగా స్పందిస్తూ, రెండు నెలల్లోగా సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -