స్పదించిన అధికారులు
గుంతలు పూడ్చడానికి శ్రీకారం ..
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలంలోని ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారాయని, వచ్చిన వార్తకు రోడ్డు భవనాల శాఖ అధికారులు స్పందించారు. తహసిల్దార్ కార్యాలయం సమీపంలో సాటా పూర్ గేటుకు వెళ్లే రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారిందని నవతెలంగాణ పత్రికలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించి గుంతలు పూడ్చే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మండలంలోని సాటాపూర్ చౌరస్తాతో పాటు, కందకుర్తి వరకు ఏర్పడ్డ గుంతలను కూడా ప్యాచ్ వర్క్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ గుంతల వల్ల ద్విచక్ర వహనాదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు అని మండల ప్రజల ఆరోపిస్తున్నారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES