డివైడర్ నీటిలో ఆయిల్ బాల్స్
నవతెలంగాణ – అశ్వారావుపేట : “దోమలు కు నిలయాలుగా డివైడర్ లు – నిండు కుండ ను తలపిస్తున్న వైనం” శీర్షికన నవతెలంగాణ లో సోమవారం ప్రచురితం కథనానికి స్పందన లభించింది. ఈ కథనం స్థానిక సోషల్ మీడియా లో వైరల్ కావడం తో స్పందించిన అశ్వారావుపేట మున్సిపల్ కమీషనర్ బి.నాగరాజు దోమలు నివారణ చర్యలు కు సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది డివైడర్ తో పాటు నీటి నిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేసారు. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తాం అని కమీషనర్ నాగరాజు నవతెలంగాణ కు తెలిపారు.
వైద్యారోగ్యశాఖ సైతం స్పందించింది.డాక్టర్ రాందాస్ ఆదేశాలు మేరకు డివైడర్ తోపాటు ఇతర నీటి నిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకు చర్యలు చేపట్టారు.