- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన సింగ్ పవార్(60), విజయ్ సింగ్ తోమర్(65), కుసాల్ సింగ్(62), సంతోషి భాయ్(62)గా గుర్తించారు. శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -



