- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని దివ్యాంగులను, సకలాంగులు వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను వివాహం చేసుకుంటే వారికి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) ప్రోత్సాహక బహుమతిగా అందజేయనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ బహుమతి పొందుటకు గాను వివాహము జరిగిన తేదీ నుండి సంవత్సరంలోపు దరఖాస్తును తెలంగాణ ఈ – పాస్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు.
- Advertisement -