- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
దాదాపుగా 40 ఏళ్లుగా మూసుకుపోయిన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. మండల కేంద్రంలోని ఎల్లమ్మ గల్లి నుండి అవల్గావ్ కు వెళ్ళే దారికి సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ రోడ్డును నిర్మించారు. ఇంతకు ముందు ఈ దారి లేకపోవడంతో పొలాలకు వెళ్ళేవారు చుట్టూ తిరిగి వెళ్ళాల్సొచ్చేది. చాలాకాలంగా ప్రజలు, రైతులు ఈ రోడ్డు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తాజాగా సర్పంచ్ కృషితో ఈ మార్గం సుగమం అవ్వడంతో గ్రామస్థులు హర్హం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



