Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాస్త్రీయ పద్దతిలో తేనే తీగల పెంపకం ఉత్తమం

శాస్త్రీయ పద్దతిలో తేనే తీగల పెంపకం ఉత్తమం

- Advertisement -

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి
నవతెలంగాణ – కాటారం

కాటారం ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తీర్మాల సమ్మయ్య వారి ఆధ్వర్యంలో తేనే తీగల పెంపకం శిక్షణ తరగతులలో భాగంగా శనివారం రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయం తో పాటు అదనపు ఆదాయ మార్గాలను ఎంచుకోవాలని అందులో భాగంగా తేనే తీగల పెంపకం అనేది చాలా ఉత్తమము అని అన్నారు. అలాగే శాస్త్రీయ పద్దతిలో పెంపకం ద్వారా స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుంది. అని రైతులకు సూచించారు. అలాగే తేనే తీగల పెంపకం నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా ఎన్ బి బి ద్వారా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది అని రైతులకు సూచన చేసారు. ఎన్ బి బి సహకారంతో శిక్షణ ఇస్తున్న సంజన, సిబ్బందినీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తీర్మాల సమ్మయ్య, కుంభం రమేష్ రెడ్డి, పంతకాని సమ్మయ్య,మరపాక రాజేంద్ర ప్రసాద్ వెంకయ్య, ఖలీల్ పాషా, శిక్షణ నిర్వహుకులు సంజన, రఘు,ఎన్ బి బి సిబ్బంది జ్యోతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -