మండల వ్యవసాయ అధికారి ఎస్కే యాస్మిన్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని నరసింహుల గూడెం క్రాస్ రోడ్ వద్ద ఉన్న శరత్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ & సీడ్స్ ను తనిఖీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ఎస్క యాస్మిన్ తెలిపారు. మంగళవారం షాపులో రిజిస్టర్ను స్టాక్ ను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్న సాయంత్రం యూరియా స్టాక్ వచ్చిన సమాచారం ఇవ్వకుండా రైతులకు విక్రయించాడని అదేవిధంగా ఎం ఆర్ పి రేటు కన్నా అధికంగా విక్రయించాడని రైతుల నుండి ఆరోపణ లు రావడం వచ్చాయని తెలిపారు. వెంటనే షాపును సందర్శించి పరిశీలించి వివరాలు తెలుసుకొని సంబంధిత డీలర్ యొక్క ఫెర్టిలైజర్ లైసెన్స్ ను రద్దు చేయడానికి ఉన్నత అధికారులకు సిఫారసు చేయడం జరిగింది అని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.
శరత్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ షాప్ తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES