- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ : మండలంలోని అంజనీ గేట్ జాతీయ రహదారి 161 పై శనివారం రోజున ఎస్సై అరుణ్ కుమార్ వాహనాలు తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా మాట్లాడుతూ రోడ్డుపై వాహనాల సంఖ్య పెరుగుతుందని, రద్దిగా ఉండే సమయంలో మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలు నడపడం కూడా పెరుగుతుందని, దీనివల్ల ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. వాహనాలు నడిపే ప్రజలు రోడ్డు నిబంధన, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడకం, 18 సంవత్సరాల లోపు (మైనార్టీలు) ద్విచక్ర వాహనాలు గనుక ఇస్తే వాహనదారునిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -