- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ ఎస్సీ విజయ్ కొండ ఇటీవలే రెండు వెండి పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కాంగ్రెస్ యువ నాయకులు సిద్ధప్ప పటేల్ ఆధ్వర్యంలో యువ నాయకులు కలిసి ఎస్సైని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిద్ధప్ప పటేల్ మాట్లాడుతూ.. ఎస్సై విధులు మండల ప్రజలకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. ఎస్సై సాధించిన రెండు వెండి పథకాలు మండలానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో యువ నాయకులు చేతన్ పటేల్, బాలు యాదవ్, భగవాన్ పాటేల్, ప్రభాకర్ పాటిల్, రాహుల్ పటేల్, పాల్గొన్నారు. అనంతరం సన్మానించిన యువ నాయకులకు ఎస్ఐ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -