నవతెలంగాణ-గోవిందరావుపేట
వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయము నందు వందేమాతరం ఎంపీడీవో చిలివేరు వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వందేమాతరం గీత రచయిత బంకించద్ర చటోపాధ్యాయ ను స్మరించుకుంటూ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం గీతం ప్రాముఖ్యతను వివరించారు. 150 వ సంవత్సరములు అగుచున్నందున కార్యాలయంలో కార్యాలయ సిబ్బందితో కలిసి వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించడం జరిగింది. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో విద్యాసంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 150 సంవత్సరాలు పూర్తయినందున వందేమాతరం గీతాన్ని మరోసారి ఆలపించి గుర్తు చేసుకున్నారు.
150వ సంవత్సరం సందర్భంగా వందేమాతరం గీతాలాపన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



