- Advertisement -
ఇజ్రాయిల్ రక్తదాహం ఆపాలి
మాంచెస్టర్ కేథడ్రల్లో హౌరెత్తిన నిరసనలు
ప్రపంచవ్యాప్తంగా గాజా ప్రజలకు మద్దతుగా నిరసనగళం విప్పుతూనే ఉన్నారు. ట్రంప్ జోక్యం చేసుకుని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుకు ఆదేశాలిచ్చినా… క్షిపణిదాడులు ఆపటంలేదు. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ఇజ్రాయిల్ సైన్యం దుందుడుకుగానే వ్యవహరిస్తోంది. దీనికి నిరసనగా శనివారం ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లోని మాంచెస్టర్ కేథడ్రల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని జీఎం ఫ్రెండ్స్ ఆఫ్ పాలస్తీనా పేరిట ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- Advertisement -