నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ పరిసర ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక గుండె వైద్య సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని పెర్కిట్ సిరి హాస్పిటల్ వైద్యులు లింగారెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. జగదీష్ చంద్ర బోస్ ప్రతి మంగళవారం గుండె సంబంధిత వైద్య సేవలు అందించనున్నారని వెల్లడించారు.
ఈసీజీ,2 డి ఎకో, టిఎంటి,బీపీ, షుగర్ పరీక్షలు ఛాతి నొప్పి, గుండె తడబాటు, శ్వాస ఇబ్బందులకు చికిత్సహార్ట్ అటాక్ తర్వాత ఫాలోఅప్ తదితర పరీక్షలు సైతం చేస్తామని చెప్పారు. “గుండె సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం అని వారు సూచించారు. అపాయింట్మెంట్ కోసం ముందుగా సంప్రదించాలని సూచించారు. సిరి హాస్పిటల్ – ప్రజల ఆరోగ్యానికి అంకితభావంతో సేవలు అందిస్తామని అన్నారు.



