Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అనారోగ్యంతో ఏఐజి హాస్పిటల్ చేరిన విషయం తెలిసిందే. త్వరలోనే ఎమ్మెల్యే పూర్తిగా కోలుకొని మన ముందుకు రావాలని కోరుకుంటూ శుక్రవారం మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో  డోంగ్లీ మండలంలోని రచ్చేశ్వర్ (రచ్చన్న) మందీర్ లో రాజు పటేల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నాగేష్ పటేల్ శశాంక్ పాటిల్ గజానంద్ పటేల్ ఉమాకాంత్ పటేల్ చాంద్ పటేల్ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -