- Advertisement -
పట్టు వస్త్రాలు సమర్పించిన సర్పంచ్ నర్సింగం
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మండలంలోని పెద్దతుండ్ల గ్రామపంచాయతీ పరిధి గాదంపల్లిలోని భూలక్మి,మహలక్మి,భువనేశ్వరస్వామి, పోచమ్మ తల్లి తదితర గ్రామదేవతలకు గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



