- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామపంచాయతీకి భారత రాజ్యాంగాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు – బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ యం ఎన్ స్వామి, మాజీ వైఎస్ ఎంపిపి కప్పెర రవీందర్ రెడ్డి, వార్డు మెంబర్లు, యువకులు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
- Advertisement -



