- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదిలిన సూచీలు చివరకు మిశ్రమంగా స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 19.63 పాయింట్లు నష్టపోయి 74,294.96 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 75.80 పాయింట్లు లాభపడి 23,346.40 వద్ద ముగిసింది.
నిఫ్టీ 23,300 స్థాయికి పైన ముగియడం మార్కెట్లో కీలక పరిణామంగా నిపుణులు పేర్కొన్నారు. ఈ స్థాయిని నిలబెట్టుకుంటే వచ్చే రోజుల్లో 23,500-23,600 వరకు నిఫ్టీ వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు తెలిపారు. 23,200, 23,000 స్థాయిలను కీలక మద్దతుగా పేర్కొన్నారు.
- Advertisement -



