- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 158 పాయింట్లు కోల్పోయి 82,339 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 25,419 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 97.96, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 71.9 డాలర్లు, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, HCL టెక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
- Advertisement -



