- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 71 పాయింట్లు తగ్గి 24,325 వద్దకు చేరగా, సెన్సెక్స్ 291 పాయింట్లు నష్టపోయి 77,783 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 99.92, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 87 డాలర్లు, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి. గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.65 శాతం, నాస్డాక్ 0.81 శాతం పెరిగాయి.
- Advertisement -



