– ప్రమాదమా .. ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తం
– పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటున్న విద్యార్థి సంఘాల నాయకులు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని జిల్లెల్లగడ్డ లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి వివేక్ (14) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన విద్యార్థి నంగునూరు మండలా కేంద్ర వాసి ఐదవ తరగతి నుండి గురుకుల పాఠశాలలో చదువుతున్నట్లు తెలిపారు. దసరా పండుగ సెలవులకు వెళ్ళిన వివేక్ ను తండ్రి సత్యనారాయణ సోమవారం హాస్టల్ లో దించి వెళ్లాడు. మరుసటి రోజు ఉపాధ్యాయులు ఫోన్ చేసి మీ అబ్బాయికి దెబ్బలు తాకాయని చెప్పి రమ్మన్నారని, వచ్చి చూసే సరికి కొడుకు మృతి చెందిన విషయం తెలిసిందని కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఏమి జరిగిందో తెలియదు కొడుకు మృతి చెంది ఉండటంతో సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థి మృతి దేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ కారిడార్ లో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు మెడకు తాడు చుట్టుకొని విద్యార్థి వివేక్ మృతి చెందినట్లు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. కానీ విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఆత్మహత్య అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది చదువుతున్న పాఠశాలలో ఇంతా నిర్లక్ష్యంగా ఉపాధ్యాయులు వ్యవహరించడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి మృతి పట్ల పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్థి మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థి మృతి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES