- Advertisement -
పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను నాలుగు వారాల్లో సూచించాలి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఆరావళి పర్వతాలకు అక్రమ మైనింగ్తో జరుగుతున్న నష్టంపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్, ఇతర అంశాలపై ఈ కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుందని పేర్కొంది. నిపుణుల కమిటీకి మైనింగ్పై అనుభవం ఉన్న పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను నాలుగు వారాల్లో సూచించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య, అమికస్ క్యూరీ కె.పరవేశ్వర్కు సుప్రీం సూచించింది. ఈ కమిటీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పని చేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
- Advertisement -



