Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీల గ్రామంలో రైతు సదస్సు పరిశీలించిన సబ్ కలెక్టర్..

నీల గ్రామంలో రైతు సదస్సు పరిశీలించిన సబ్ కలెక్టర్..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ : దీర్ఘకాలికంగా రైతుల భూ సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రైతులకు ఎంతో మేలు జరుగుతుందని బోధన్ సబ్ కలెక్టర్ విశాల్ మహతో పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నీల జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన రెవెన్యూ రైతు సదస్సు లో ఆయన పాల్గొని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని సరి చేసుకోవాలని సూచించారు. రైతులు పట్టా పాస్ పుస్తకాలు, కులము, సర్వే నెంబర్లు, అసైన్మెంట్ భూములు, సాదా బై నామ వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సరి చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట తహసిల్దార్ శ్రావణ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -