- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ఈ సదస్సులో వ్యవసాయదారులు పాల్గొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని మండల తహసిల్దార్ ఎండి.ముజీబ్ అన్నారు. ఈ సదస్సు హాజరైన వ్యవసాయదారులకు అవగాహన కల్పించారు. సమస్యలున్న వ్యవసాయదారులు దరఖాస్తులు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ కంప్యూటర్ ఆపరేటర్ సతీష్, ఇతర అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అవలగావ్ గ్రామ వ్యవసాయదారులు, ఆ గ్రామ పంచాయతీ అధికారి పాల్గొన్నారు.
- Advertisement -