- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి నూతన మండల కమిటీని ఎన్నుకున్నట్లు భువనగిరి పార్లమెంటు కమిటీ కన్వీనర్ కుందారపు కృష్ణాచారి, అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు గుమ్మడి అంజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా రేగు బీరప్ప, ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సిద్ధగోని ధనుంజయ ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ఎర్రబోయిన రమేష్ యాదవ్, మండల టిడిపి నాయకులు గోపి ప్రభాకర్, వానిశెట్టి సురేష్ రెడ్డి, ఏనబోయిన కనకరాజు, బోయిని బిక్షపతి పాల్గొన్నారు.
- Advertisement -