- Advertisement -
– నిత్యావసర వస్తువుల అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని కోయరంగాపురంలో ఇటీవల అగ్ని ప్రమాద గురై సర్వం కోల్పోయిన కారం మల్లయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా నిలిచారు. మంగళవారం బాధిత కుటుంబాన్ని అశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు కట్రం స్వామి దొర పరామర్శించారు. అనంతరం నిత్యావసర వస్తువుల సరుకులు అందజేశారు. ఆయన వెంట తుమ్మల నాగేశ్వరరావు, కార్యకర్తలు ఉన్నారు.
- Advertisement -



