Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సర్దుబాటును వాయిదా వేయాలి..

ఉపాధ్యాయుల సర్దుబాటును వాయిదా వేయాలి..

- Advertisement -

పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి 
నవతెలంగాణ – భూపాలపల్లి : ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వాయిదావేయాలనీ పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి  ,జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ లు కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడానికి , విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకొనడం కొరకు ఈ వేసవి సెలవులలో అన్ని మేనేజ్మెంట్లలో పనిచేస్తున్నాయాన్నారు. ఉపాధ్యాయులకు రాష్ట్రం ,జిల్లా, మండల స్థాయి వరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు  చేసి పాఠశాలల బలోపేతం కొరకు కృషి చేసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఒకవైపు బడిబాట షెడ్యూల్ ను ఈనెల ఆరో తారీకు నుండి , 19వ తారీకు వరకు ప్రకటించి, పాఠశాలలను బలోపేతం చేయండి అని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.  ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే ప్రక్రియ 13వ తారీకు లోపు పూర్తి చేయాలని మరొక ఉత్తర్వులను ఇచ్చి ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తుందని ఆరోపించారు. బడిబాట షెడ్యూలు పూర్తయి తేనే పాఠశాలల బలోపేతం కొరకు, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడం కొరకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. కావున పాఠశాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని బడిబాట షెడ్యూల్  పూర్తయిన అనంతరం ,అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం మాత్రమే ఈ యొక్క ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని, అప్పటివరకు ఎలాంటి సర్దుబాటు ప్రక్రియ చేపట్టకుండా వాయిదా వేయాలని కోరారు.

గత విద్యా సంవత్సరంలో సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్ మీద వేరువేరు పాఠశాలలోకి పంపించిన సందర్భంలో గత విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ,వారు చివరి రోజున తిరిగి వారి సొంత పాఠశాలల్లోకి చేరేలా ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. వారిని అదే పాఠశాలలో కొనసాగేలా సందేశాలు పంపడంతో, వారంతా అదే పాఠశాలలో కొనసాగుతున్నారు.. ఆయా పాఠశాలల్లోని  విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం డిప్యూటేషన్ మీద వెళ్లినటువంటి ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తూ, వారిని వారి పూర్వపు పాఠశాలల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల ఎన్రోల్మెంట్ను పెంచడానికి కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుసుమ కృష్ణమోహన్ మంత్రి లింగమూర్తి, భూపాలపల్లి మండల అధ్యక్షుడు కొండపర్తి హరిప్రసాద్ లతోపాటు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -