- Advertisement -
-ఎంఈవో చంద్రుడుకు వినతి పత్రం అందజేస్తున్న చెదురుపల్లి గ్రామస్తులు
నవతెలంగాణ-వెల్దండ
చెదురుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఉపా ధ్యా యలను నియ మించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. తాసీల్దార్ కార్తిక్ కుమార్, ఎంఈవో చంద్రుడును కలిసి వినతి పత్రాలను అందజేశారు. పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులుమాత్రమే ఉన్నారని, దీంతో విద్యార్థుల సిల బస్ ముందుకు సాగడం లేదని వినతిలో పేర్కొన్నారు. ఆలస్యమైతే విదాద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, వెంటనే ఉపాద్యాయులను నియమించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల నాయకులు పోలె అశోక్, శ్రీరాములు, పర్వతాలు ,శివ, లక్ష్మణ్, శివ తదితరులు ఉన్నారు.
- Advertisement -

                                    

