- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్పాటిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కేంద్రమంత్రి సుమారు గంటన్నరపాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ.. 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి.
- Advertisement -