Sunday, June 8, 2025
E-PAPER
Homeజాతీయంఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు !

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు !

- Advertisement -

-భాగస్వాములు అర్ధం చేసుకోవాలన్న జైశంకర్‌
– బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శితో భేటీ
న్యూఢిల్లీ :
ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ ఉపేక్షించేది లేదని, తమ భాగస్వాములు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని భారత్‌ ఆశిస్తోందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ అన్నారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న బ్రిటీష్‌ విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీతో శనివారం భేటీ సందర్భంగా జై శంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాక్‌లను ఒకే గాటన కట్టవద్దని ఆయన కోరారు. అయినా ఉగ్రవాదానికి పాల్పడేవారిని, బాధితులను ఒకే రీతిగా ఎలా చూస్తారని ఆయన ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్ర దాడిని ఖండించినందుకు, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ప్రకటించినందుకు ఆయన బ్రిటన్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు. భారత్‌, పాక్‌ల మధ్య శాశ్వత కాల్పుల విరమణకు, చర్చలు, విశ్వాస పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అమెరికా, బ్రిటన్‌లు కృషి చేస్తున్నాయని మే 17న పాక్‌లో పర్యటన సందర్భంగా లామీ చెప్పారు. ఆ ప్రకటనను ఆనాడే భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌, పాక్‌ మధ్య మూడో పక్షం జోక్యం ఉండదని స్పష్టం చేసింది.
భారత్‌-బ్రిటన్‌ల మధ్య కుదిరిన ఎఫ్‌టీఎను జై శంకర్‌ ప్రస్తావిస్తూ, ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక మైలురాయి అని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడమనేది మా ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ప్రారంభం మాత్రమేనని లామీ వ్యాఖ్యానించారు. ఈ సరికొత్త అంతర్జాతీయ శకంలో భారత్‌తో ఆధునిక భాగస్వామ్యాన్ని నిర్మించుకుంటున్నామని చెప్పారు. భారత్‌కు బయలుదేరడానికి ముందుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సాంకేతికత, వాతావరణ సంక్షోభ పరిష్కారం, భద్రతా పరమైన అంశాల్లో పరస్పరం సహకారం పెంచుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -