నవతెలంగాణ – ఆర్మూర్: ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలనీ, యుద్ధాలు ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తాయనీ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు, డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ లు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సీపీఐ(ఎం) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర పహల్గం ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు, వీర జవాన్లకు నివాళి అర్పిస్తూ ఆదివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేయాలని, దేశ ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని అన్నారు.
యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్య ఉన్న శాంతికి విఘాదం కలిగిస్తాయని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇంటిలిజెన్సీ విభాగం వైఫల్యం కారణంతో పహల్గాం ఉగ్రదాడి జరిగిందని తెలిపారు. దాదాపుగా 26 ప్రాణాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి సిద్ధపడిన మన ప్రభుత్వం, అమెరికా ట్రంప్ యుద్ధాన్ని నివారించమని శాంతి చర్చలు జరపడం ద్వారా పాకిస్తాన్ పై యుద్ధాన్ని ఆపినామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మన భారతదేశ సైనిక స్థావరాలు అమెరికాకు చెప్పడం ఏమిటని అన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూరు పేరుతో ఉగ్రవాదుల శిబిరాలను అంతం చేశామని చెప్పటం, ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే యుద్ధం ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది అన్నారు.
వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలంటే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులు గడిచినా.. కనీసం ఒక్కసారైనా మరణించిన కుటుంబాలను మోడీ పరామర్శించకపోవడం బాధాకరమని అన్నారు.
పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు అడిగితే, మోడీ ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ఉగ్రవాదులు దాడి చేసినా.. కాశ్మీర్ కు వెళ్లకుండా బీహార్ బిజెపి ఎన్నికలపై ప్రచార సభలో మోడీ పాల్గొనడం చూస్తే ఉగ్రవాదుల దాడిని చూపించి సెంటిమెంట్తో ఓట్లు సంపాదించాలని చూస్తున్నట్లు కనపడుతుంది అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయిల్ కు మద్దతు ఇజ్రాయిల్ పాలస్తీనాపై గాజాపై ఇరాన్ పై దాడులు చేయటాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు.
ఆ యుద్ధాల ద్వారా ప్రయోజనం ఏమి లేదని సామాన్య ప్రజలు బలవుతున్నారని అన్నారు ఇరాన్ లో ఉన్న ఆయిల్ సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకోవటానికి ఇజ్రాయిల్ అడ్డం పెట్టుకొని యుద్ధం కొనసాగిస్తుందని అన్నారు. వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధాన్ని వ్యతిరేకించాలని నరేంద్ర మోడీ ట్రంప్ కు యుద్ధాన్ని ఆపాలని చెప్పాలని అన్నారు. జరుగుతున్న దాడులలో అమాయక ప్రజలు తినటానికి తిండి లేక ఇసుక తింటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు ఎన్నో అని అన్నారు. వెంటనే అక్కడ ప్రజలకు తినటానికి తిండి ట్రక్కులను నియంత్రించకుండా ప్రజలకు ఆహారాన్ని అందించే విధంగా ట్రంప్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అహ్మదాబాద్ లో జరిగిన విమానంలో చనిపోయిన ఘటనకు సంబంధించి నిజాలను చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది అని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరేషన్ కాగారు పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని, అక్కడ కాల్పులు ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు ఈ భూమన్న, కుల్దీప్ శర్మ సాయిలు ఓంకార్ లాల్య నాయక్, గంగ నరసయ్య, గణేష్, నవీన్, భాయ్,,కలీం,జాను,శ్రవణ్,తదితరులు పాల్గొన్నారు.