- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన టీజీఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐసెట్ నోటిఫికేషన్ను శుక్రవారం టీజీఐసెట్ చైర్మెన్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అలువల రవి శుక్రవారం షెడ్యూల్ను ప్రకటించారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 13, 14 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షను నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550 కాగా, ఇతర అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు.
- Advertisement -



