Monday, December 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅదే శోభన్‌బాబు ప్రత్యేకత

అదే శోభన్‌బాబు ప్రత్యేకత

- Advertisement -

నటుడిగా, వ్యక్తిగా శోభన్‌ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని నటుడు మురళీ మోహన్‌ అన్నారు. శోభన్‌ బాబు హీరోగా రూపొందిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సురేష్‌ ప్రొడక్షన్స్‌, అభిల భారత శోభన్‌ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్‌ ప్రొడక్షన్స్‌ అదే రోజున ఈ సినిమాను రీ-రిలీజ్‌ చేయనుంది. ఈ క్రమంలో రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్‌ రైజర్‌ (ముందస్తు) ఈవెంట్‌ ను నిర్వహించారు. మురళీమోహన్‌ మాట్లాడుతూ, ‘నాకు తొలి అవకాశం ఇచ్చింది నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు. అయితే నన్ను ప్రోత్సహించింది దాసరి నారాయణరావు, నన్ను సినిమా రంగంలోనికి రమ్మని ఆహ్వానించింది శోభన్‌ బాబు. నా జీవితంలో ఈ ముగ్గురినీ ఎన్నటికీ మరచిపోలేను.

శోభన్‌బాబుతో నేను ‘ముగ్గురు మిత్రులు’ అనే చిత్రం కూడా తీశాను. అయన భౌతికంగా దూరమై 17 ఏళ్లు అయ్యింది. అంతకుముందు 13 సంవత్సరాలు పాటు ఆయన నటించలేదు. అంటే 30 ఏళ్లు గడిచినా శోభన్‌ బాబును గుర్తుపెట్టుకుని అభిమానులు మంచి మంచి కార్యక్రమములు నేటికీ చేస్తున్నారంటే…అది శోభన్‌బాబు పట్ల వారికి ఉన్న ప్రేమ, గౌరవమే కారణం’ అని అన్నారు. ‘1975లో విడుదలైన ‘సోగ్గాడు’ చిత్రంతో మా సంస్థకు మంచి పేరును, డబ్బును తెచ్చిపెట్టింది. సౌండ్‌కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేయబోతున్నాం. మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం’ అని సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -