– కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి
– విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : డ్రగ్స్ మహమ్మారి జీవితాలను చిన్నభిన్నం చేస్తుందని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ… గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణలో యువత పాత్ర పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్ల వైపు తొందరగా ఆకర్షితులు అవుతారని, మన మనస్సును మనం మన అదుపులో ఉంచుకున్నప్పుడే చెడు అలవాట్లకు దూరంగా ఉంటామన్నారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యంతో పాటు ఎంతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడినవారు ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో అఘైత్యాలకు, ఎన్నో ఘోరాలకు పాల్పడుతున్నారన్నారు. కొన్నిసార్లు తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారుని ఆవేదన వ్యక్తం చేశారు.డ్రగ్స్ మహమ్మారి వల్లే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందన్నారు. యువత చెడు అలవాటులకు దూరంగా ఉన్నప్పుడే సమాజంలో ప్రశాంత వాతావరణం ఏర్పడి క్రైమ్ రేటు తగ్గుతుంది అన్నారు. మత్తులో వాహనాలు నడపడం వల్ల మన ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా, ఎదుటివారి పాణాలను కూడా అరిస్తున్నామనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు. యువత జీవితంలో పైకి ఎదగాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ మహమ్మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES