జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్
ప్రొఫెసర్ జయశంకర్ 2వ రోజు బడిబాట కార్యక్రమం
నవతెలంగాణ – భూపాలపల్లి : ప్రభుత్వ పాఠశాలలలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలకు విద్యార్థులకు వివరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ తెలిపారు. శనివారం భూపాలపల్లి మండలం జంగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సమావేశంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు 551/600 సాధించిన విద్యార్థి కె. అజయ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ… ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్య ఆరోగ్యం న్యూట్రిషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలలు విద్యాసంస్థలలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న నూతన సాంకేతిక విద్య, క్రీడా, సాంస్కృతిక తదితర అంశాలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిందని తెలిపారు. కావున ఉపాధ్యాయులు వాటి యొక్క ప్రాముఖ్యత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను అందించాలని సూచించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించాలని ప్రచారంతోపాటు బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ స్వయం సహాయక బృందాలు,మెప్మా తదితర మహిళా సంఘాలు వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరారు. ప్రభుత్వ సూచించిన ప్రకారం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల హాజరు శాతం పెంచాలని ఆయన కోరారు. అనంతరం ఉపాధ్యాయులు చేపట్టిన ఇంటింటి బడి ఈడు పిల్లలను గుర్తించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అజ్మీర దేవా, జిల్లా సామాజిక సమన్వయకర్త సామల రమేష్, క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, ప్రణాళిక సమన్వయకర్త దుప్పటి రాజగోపాల్, జంగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్.అశోక్ లతో పాటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక బృందాలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, విద్యావంతులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలకు వివరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES