– జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి
నవతెలంగాణ – అశ్వారావుపేట: కార్యాలయ సముదాయాలలో ఏర్పాటు చేసే ఇంకుడు గుంతలు నిర్మాణం ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి అన్ని శాఖల మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. డీ ఆర్డీఓ అదనపు పీడీ ఎన్.రవి తో కలిసి ఆమె మండలంలోని వినాయక పురం (అశ్వారావుపేట) ప్రాధమిక ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన ఇంకుడు గుంతలను శనివారం పరిశీలించారు. ముందుగా వారు ఇరువురు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఈఓ సీతారామరాజు, ఎంజీఎన్ఆర్ ఈజీఏ ఏపీవో రామచంద్రరావుతో సమావేశం అయి రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు కార్యాచరణపై సమీక్షించారు. స్వచ్చ భారత్ గ్రామీణ నిధులతో,రూ.60 లక్షలు వ్యయంతో నిర్మించ బోయే ప్లాస్టిక్ రీ సైక్లింగ్ మేనేజ్మెంట్ యూనిట్ కు నారం వారిగూడెం కాలనీలో,రూ.3 లక్ష వ్యయంతో వినాయక పురం ఆవరణలో నిర్మించబోయే కమ్యూనిటీ శానిటరీ యూనిట్ కు స్థలాలు పరిశీలించారు.
ఈ నెలాఖరులోగా ఇంకుడు గుంతలు పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES