Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి...

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి…

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం కోసం  చర్యలు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 70 అర్జీలను,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  భాస్కర్ రావు కలసి  అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను   పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.

అందులో రెవిన్యూ శాఖ 57,జిల్లా పంచాయతీ శాఖ 3, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 3,సర్వే ల్యాండ్స్ 2, కోపరేటివ్ , ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, జిల్లా సంక్షేమ శాఖ, సివిల్ సప్లై  శాఖలకు ఒక్కొకటి చొప్పున  వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad