Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యా హక్కు చట్టం అమలు చేయాలి..

విద్యా హక్కు చట్టం అమలు చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి : కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ ఆధ్వర్యంలో సెక్షన్ 12(1)(సి) ప్రకారం 25 శాతం ఉచిత సీట్ల అమలుకు పిటిషన్  ఇవ్వడం జరిగిందనీ సి సి ఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  2025 – 26 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పౌర హక్కుల కోసం పని చేస్తున్న జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సి సి ఆర్)  కామారెడ్డి లోని జిల్లా కలెక్టర్ కి, జిల్లా విద్యా అధికారి కి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.

ఈ వినతి పత్రంలో, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా ఇవ్వాలని, సెక్షన్ 12(1)(సి) ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం అమలు లోపాలు, రీయింబర్స్‌మెంట్ జాప్యం, సమాచారం లోపం వంటి అంశాలపై సి సి ఆర్ లోతుగా చర్చించిందన్నారు. సి సి ఆర్ ప్రతినిధులు 7 ముఖ్యమైన ప్రతిపాదనలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించామన్నారు. ఈ చర్యలు విద్యా సమానత్వాన్ని సాధించడంలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్ కోసం పనిచేసిన సి సి ఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు మంచి కట్ల అనిల్ కుమార్,  సిసిఆర్ మిషన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కేంద్ర కమిటీ సభ్యులు కాకర్ల అశోక్ ల ఆధ్వర్యంలో  కామరెడ్డి జిల్లాలకు చెందిన ప్రతినిధులు – జోనల్ సెక్రటరీ కరీమోద్దీన్, జిల్లా కార్యదర్శి బూర్ల శ్రావణ్ కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ భాస్కర్, మీర్జాపురం రామకృష్ణ, సాయన్న, విద్యా వేత్తలు, యువనాయకులు పాల్గొని, ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. పేద విద్యార్థులకు ఇది ఒక ఆశ కిరణంగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -