- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్దతు ధరతో కొనుగోలు చేపట్టే కంది పంటకు ఈనెల 26వ తేదీ చివరిదని మద్నూర్ ఎఫ్ పి ఓ రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చాట్ల గోపాల్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేదీ గడువు నాలుగు రోజులే ఉన్నందున కంది పంట రైతులు తమ పంటను మద్దతు ధర కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకోవాలన్నారు. రైతులు గమనించి తమ వద్ద ఉన్న కంది పంటను మద్దతు ధర కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకోవాలని కోరారు. తేమ శాతం 11గా సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర కంది పంటకు క్వింటాలుకు 8000 ఉంది.
- Advertisement -



