Wednesday, November 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్స్మశాన వాటికలో నిలువ ఉన్న కలప పట్టివేత

స్మశాన వాటికలో నిలువ ఉన్న కలప పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ జన్నారం

విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, నహీదా బేస్ క్యాంప్ వాచర్‌తో కలిసి తపాల్‌పూర్ గ్రామంలో తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా శ్మశానవాటికలో తాళం వేసి ఉన్న గదిని తెరిచి చూడగా, లోపల ఒక కలప దుంగ దొరికిందని ఎఫ్ఆర్ఓ సుష్మ రావు తెలిపారు.

దొరికిన కలపను స్వాధీనం చేసుకొని రేంజ్ కు తరలించడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న కలప 1/0.077 క్యూబిక్ మీటర్లు, ఉంటుందన్నారు దాని విలువ రూ. 6,466/- వరకు ఉంటుందన్నారు. కలపను అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తుల ను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -