Thursday, June 5, 2025
E-PAPER
Homeజిల్లాలుజుక్కల్ లో విద్యుత్ నియంత్రికల చోరీ..

జుక్కల్ లో విద్యుత్ నియంత్రికల చోరీ..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామంలో ఒకేరోజులో సోమవారం రాత్రి నాలుగు విద్యుత్తు నియంత్రికలు రైతుల వ్యవసాయ భూమిలో చోరీకి గురైన ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్యుత్ నియంత్రికలు చోరీకి గురైన  పడంపల్లి గ్రామ రైతులు 1) . బిరాదార్ శివరాజ్. 2) . మోండకార్ బాలాజీ. 3) . సుంకరి శ్రీనివాస్ . 4 . హంగర్గ గంగాధర్  అనే రైతుల వ్యవసాయ భూమిలో విద్యుత్తు నియంత్రికాలు చోరీకి గురైనాయని రైతులు తెలిపారు. ప్రస్తుతము వారి వ్యవసాయ భూమిలో బొప్పాయి, కర్బుజా, ఇతర వాణిజ్య పంటలు లక్షల రూపాయలు వెచ్చించి పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తున్నారు. రెండవ తేదీ సోమవారం అర్ధరాత్రి విద్యుత్తు నియంత్రికలు చోరీకి గురైనట్టు తెలిపారు. ఉదయం నీళ్లు పారించెందుకు బోరు మోటర్ దగ్గరికి వెళ్లిన రైతులు విద్యుత్తు లేకపోవడంతో నియంత్రిక వద్దకు వెళ్లి చూడగా అక్కడ చెల్లాచెదురుగా ట్రాన్స్ ఫార్మర్ విప్పిపడేసిన సామాన్లు ఉన్నాయి. ఇది చూసిన రైతులు ఆశ్చర్యానికి గురైయ్యారు. అందులోని రాగి తీగలు, ఇతర సామాగ్రి భారీగా చోరీకి గురికావడంతో రైతులు లబోదిబోమన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ గోడును చెప్పుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ దొంగతనం వలన నీరు పెట్టక పోవడంతో, పంటలు ఎండిపోయి దిగుబడి తగ్గడం జరుగుతుందని అన్నారు. లక్షల ఖరీదైన వాణిజ్య పంటలు ఎండిపోతాయని  బాధిత రైతులు తెలిపారు. ఒకేరోజు నాలుగు విద్యుత్తు నియంత్రికలు చోరీకీ గురి కావడంతో గ్రామంలో ఒక్కసారిగా రైతుల గుండెల్లో గుబులు మొదలై విషాదఛాయలు అమలుకున్నాయి. నియంత్రికలు అమర్చుకున్న ఇతర రైతులు తమ పంట పొలాల వద్ద ఉన్న నియంత్రికల వద్దకు తమయి ఉన్నాయో? లేదో ? అని ఉరుకులు పరుగులు తీశారు. వెళ్లి తమ నియంత్రికలు సేఫ్ గా ఉన్నాయో లేదో అని వ్యవసాయ భూమికి వెళ్లడం చూడడం జరిగింది. గతంలో కూడా పడంపల్లి గ్రామంలో విద్యుత్తు నియంత్రికలు చోరీకి గురిగైనా ఘటనకు సంబంధించి ఇప్పటికీ దొంగలు పట్టుబడిన సందర్భాలు లేవు. ప్రస్తుతము జూన్ మూడవ తేదీ సోమవారం జరిగిన సంఘటన మండలంలో హాట్ టాపిక్ గా మారింది. నియంత్రికలు భారీగా ఒకేరోజులో నాలుగు చోరీకి గురియాయని, రైతులు గ్రామ సంబంధిత హంగర్ గా ఫీడర్ లైన్మెన్ నాగప్పా , ట్రాన్స్కో ఎఈ మోహన్ కు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు చోరికి గురి అయిన గ్రామాల రైతుల వ్యవసాయ భూమిలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి విద్యుత్ అధికారులు జుక్కల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పడంపల్లి గ్రామంలో మోండ్ కార్ శివరాజ్ ఆరు ఎకరాలలో బొప్పాయి పంట సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతము పంటలకు నీటీ అవసరం భారీగా అవసరం ఉంది. ఈ చోరీ వల్ల లక్షల పెట్టుబడి బూడిద పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే విద్యుత్ అధికారులు దొంగతనం జరిగిన స్థానంలో కొత్త విద్యుత్ నియంత్రికలను అమర్చి తమను ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -