యూనిటీ అనేది అందరి లక్ష్యం కావాలి – డీజీపీ, సీపీ
నవతెలంగాణ – బంజారా హిల్స్
రాష్ట్రీయ ఏక్తా దివాస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా ‘రన్ ఫర్ యూనిటీ’ – ఏడు జోన్లలో నిర్వహణ…భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివాస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్న సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీసులు నేడు ఉదయం ‘రన్ ఫర్ యూనిటీ’ ని ఘనంగా నిర్వహించినారు.
ఈ రన్ ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్తో పాటు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఘనంగా నిర్వహించినారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అద్భుతమైన కృషిని స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమైక్యత,సమగ్రత భద్రతకు కట్టుబడి ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పడం జరిగిందనీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘రన్ ఫర్ యూనిటీ’ లో సుమారు 5 వేల మంది పౌరులు,రన్నర్లు ఉత్సాహంగా పాల్గొనీ ఐక్యతతో సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పారు.
ముఖ్య అతిథిగా హాజరై మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ కొణిదెల శివ ప్రసాద్ @చిరంజీవి,డీజీపీ,డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,తెలంగాణ బి.శివధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐపిఎస్,డైరెక్టర్ ఈగల్ సందీప్ శాండిల్య,అడిషినల్ డిజిపి ఎల్.అండ్ ఓ,యం.యం. భగవత్,నగర సిపి వి.సి.సజ్జనార్లు మాట్లాడారు…
సర్దార్ పటేల్,దృఢ సంకల్పం,విజన్ కార్యదీక్షత నేటి తరానికి ఆదర్శనీయమాని అన్నారు.560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసి, ‘వన్ నేషన్’ ని మనకు అందించిన గొప్ప వరం సర్దార్ పటేల్ అని తెలిపారు. ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ అనే పటేల్ సందేశాన్ని పోలీసులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమనీ కొనియాడారు.
‘డీప్ ఫేక్’ అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని, ఈ సమస్యను డీజీపీ,హైదరాబాద్ సీపీలు సీరియస్గా తీసుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని ధైర్యం ఉండాలని అలాగే వారికి ప్రజల సహకారం అందించాలని తెలిపారు.
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ… ఇది కేవలం ‘పరుగు’ మాత్రమే కాదు, అందరూ జాతీయ ఐక్యత కోసం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన కార్యక్రమం. సర్దార్ వల్లభాయ్ పటేల్ తన పట్టుదలతో 560కు పైగా ముక్కలైన సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి దేశాన్ని బలోపేతం చేశారని కొనియాడారు. సిపి వి.సి.సజ్జనార్ మాట్లాడుతూ… యవత సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని తెలిపారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు. ముఖ్యంగా, ‘డీప్ ఫేక్’ అంశాన్ని సీరియస్గా తీసుకుని సైబర్ నేరస్థుల మూలాలపై దృష్టి సారించాము. పిల్లలు 5 వేల నుంచి ,10 వేల కోసం సైబర్ నేరస్థులకు మ్యూల్ అకౌంట్స్ ఇవ్వడం వల్ల వారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలనీ సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి లా ఆండ్ ఆర్డర్, తఫ్సీర్ ఇకుబాల్,జాయింట్ సిపి ట్రాఫిక్, డి. జోయల్ డెవిస్,డిసిపి సెంట్రల్ జోన్, కె. శిల్పావళ్ళి,డిసిపి స్పెషల్ బ్రాంచ్ కె. అపూర్వారావు,డిసిపి, సైబర్ క్రైమ్, ధార కవిత,డిసిపి,వుమెన్ సేఫ్టీ, లావణ్య నాయక్ జాదవ్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


 
                                    