Friday, June 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలి: పోతినేని సుదర్శన్ రావు    

కేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలి: పోతినేని సుదర్శన్ రావు    

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
కేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. గురువారం మండలం కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రెండవ జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా గోవిందరావుపేటలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుంటూ పీఎస్ఆర్ గార్డెన్ లో మహాసభ నిర్వహించడం జరిగింది మహాసభ కంటే ముందు జెండా ఆవిష్కరణ రైతు సంఘం సీనియర్ నాయకుడు గుండు సత్యనారాయణ చేశారు ఈ మావ సభకు  చిట్టెం ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్యఅతిథిగాధరైన పోతినేని సుదర్శన్ రావు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు సూడి కృష్ణారెడ్డి రైతు సంఘం రాష్ట్ర నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని పార్లమెంట్లో గిట్టుబాటు ధర చట్టం కోసం రైతులు పెద్ద ఎత్తున రెండు సంవత్సరాల నుండి ఆందోళన చేస్తున్న పార్లమెంట్లో చట్టం తేలేదని ఎన్నికల ముందు గిట్టుబాటు ధర చట్టం పార్లమెంటు తెస్తాని హామీ ఇచ్చి రైతుల ను  మోసం చేశాడని ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా చట్టం తెచ్చి వేలాది ఎకరాల భూమి అప్పజెప్తున్నారని పేర్కొన్నారు రైతుల పోరాట ఫలితంగా మూడు నెలచట్టాలు రద్దుచేసి నూతనంగా జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదా పేరుతో కార్పొరేట్లకు అనుకూలంగా ఈ చట్టం తెచ్చారని పేర్కొన్నారు  .దీనికి వ్యతిరేకంగా రైతులు సంఘటితంగా ఆందోళన నిర్వహించాలని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు ఇస్తానని అమలు చేయలేదని ,అనేక మంది రైతులు రెండు లక్షల పైన ఉన్న బాకీలు గట్టి ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా  ను రైతులు కాస్తు చేస్తున్న భూములు అన్నిటికీ ఇస్తానని గతంలో మూడెకరాల భూమికే రైతు భరోసా వర్తింపజేశారని  ఈ ఖరీఫ్ సీజన్లో ఎకరం నుండి మొదలుపెట్టి  ఎన్ని ఎకరాలకు ఇస్తారో తెలియదని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వ ఇచ్చిన హామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ములుగు జిల్లాలో వడగండ్ల వాన పడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అంతేకాకుండా జిల్లాలో నకిలీ విత్తనాలతో మొక్కజొన్న రైతులు నష్టపోయారని వారికి ఎకరాకు లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు .రైతాంగ గిట్టుబాటు ధర కోసం, పోడు భూముల హక్కుల కొరకు అక్కుపత్రాలు వచ్చేవరకు పోరాటాలు నిర్వహించామని జిల్లాలో సాగునీటి సౌకర్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని గోదావరి జిల్లాలో ములుగు జిల్లాకు అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములలో కాస్త కబ్జాలో ఉన్న పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోడు భూములకు ఇంకా 40 వేల ఎకరాల భూమి కి అక్కుపత్రాలు ఇవ్వలేదని వారికి కూడా సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి ,ఎండి గఫూర్ పాషా, తీగల ఆదిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, సోమ మల్లారెడ్డి, గుండు లెనిన్ ,ఓకే నాగేశ్వరరావు ,వ డకాపురం సారయ్య ,బండారి నరసింహులు, నలబోయిన పాపారావు, కావిరి నాగయ్య, సురేష్ గజ్జల సుధాకర్, గౌరారపు చంద్రశేఖర్, కాంటెం సత్యం, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారూ.

3 attachments • Scanned by Gmail

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -