- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు రౌడీ షీటర్లు మైనర్ బాలికపై గంజాయి మత్తులో లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికను వదిలేసి పరారయ్యారు. బాలికను ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
- Advertisement -



