- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండల కేంద్రంలో గురువారం మాఘ శుద్ధ ఏకాదశి రోజున అభయాంజనేయ స్వామి దేవాలయం తృతీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ అధ్యక్షులు దాచేపల్లి వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. ఉదయం 8 గంటలకు స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, 11 గంటలకు యజ్ఞం మధ్యాహ్నం 1:30 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు మండల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.
- Advertisement -



