- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారిని గుర్తించి టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా రామ్ భూపాల్ కు బాధ్యతలు ఇవ్వడం సంతోషంగా ఉందని వివేకానంద యూత్ జిల్లా అధ్యక్షుడు, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రాంభూపాల్ నిజామాబాద్ వచ్చిన సందర్భంగా స్థానిక పులాంగ్ చౌరస్తా వద్ద రాంభూపాల్ ని పెద్ద ఎత్తున ఘనంగా సన్మానం చేశారు.
- Advertisement -