Friday, June 13, 2025
E-PAPER
Homeఖమ్మంస్వచ్చ మిత్రులకు శిక్షణ..

స్వచ్చ మిత్రులకు శిక్షణ..

- Advertisement -

నిర్వహణపై శిక్షణ.. ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఈ ఏడాది విద్యా సంవత్సరం పాఠశాలలో పారిశుధ్యం విధులను స్వచ్చ మిత్ర లు నిర్వహించనున్నారు. కరోనా అనంతరం కొంత కాలం స్థానిక పంచాయితీల పారిశుధ్యం కార్మికులు ఈ విధులను నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం ఈ విధులను స్వచ్చ మిత్రులకు అప్ప జెప్పనున్నారు. ఈ మేరకు అశ్వారావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు మరియు పాఠశాల గ్రౌండ్ క్లీనింగ్,నిర్వహించే “స్వచ్ఛ మిత్ర”లకు  ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని బాలిక ఉన్నత పాఠశాల అశ్వారావుపేట లో నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు స్వేచ్ఛ మిత్ర లు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ మిత్ర  చేయవలసిన పనులను ఎంఈఓ ప్రసాదరావు వారికి వివరించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండడమే ముఖ్యం అని,ఆరోగ్యంగా ఉన్నప్పుడే చక్కగా చదువుకోవడం సాధ్యపడుతుంది అని,కాబట్టి విద్యా వ్యవస్థలో స్వచ్ఛ మిత్ర పాత్ర చాలా కీలకమైనది,స్వచ్ఛ మిత్రులు డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ క్లీనింగ్, పాఠశాల గ్రౌండ్ క్లీనింగ్, తరగతి గదుల క్లీనింగ్ మరియు పాఠశాలలో గార్డెన్ బాధ్యతలను నిర్వహించవలసిన  విధానం పాఠశాల క్లీన్ చేసే విధానాన్ని పి పి టి ద్వారా రిసోర్స్ పర్సన్ శ్రీ బి. శ్రీశైలం వివరించారు. బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండల్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో స్వచ్ఛత యొక్క ప్రాధాన్యత వివరించారు.జడ్పీహెచ్ఎస్ అశ్వారావుపేట ప్రధానోపాధ్యాయులు హరిత మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య ప్రదాత లు అన్నారు. కార్యక్రమంలో సిసిఓ మెహబూబ్,ఎం ఐ ఎస్ రమేష్, సిఆర్పిలు మల్లేశ్వర నాయక్, రామారావు, జ్యోతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -