- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి చెట్లు కూలిపడ్డాయి. మద్నూర్ మార్కెట్ యార్డులో ఆగిఉన్న లోడు లారీపై భారీ చెట్టు విరిగి పడింది. దీంతో ఉదయం మార్కెట్ కమిటీ అధికారులు లారీపై కూలిన చెట్టును తొలగించారు. అర్ధరాత్రి నుండి ఈదరుగాలులు, వర్ష భీభత్సానికి కరెంటు అంతరాయం ఏర్పడి ఉదయం వరకు రాలేదు. దీంతో పాటు మండలంలో అక్కడక్కడ భారీ చెట్లు నేలమట్టం అయ్యాయి.
- Advertisement -