- Advertisement -
నవతెలంగాణ – కాటారం
సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల విభాగంలో కాటారం గిరిజన గురుకుల బాలికలు అత్యంత ప్రతిభ కనబరిచి 12 మంది విద్యార్థినులు ప్రథమ స్థానంలో నిలిచారు. జనవరి 17, 18 న ఆదిలాబాద్ లో జరగనున్న సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో కాటారం గిరిజన విద్యార్థినులు ఎంపికైనట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ పూతల సమ్మయ్య ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మేడం నాగలక్ష్మి , వైస్ ప్రిన్సిపల్స్ సరిత, కల్పన , పీడీ గౌతమి, పిఈటీ శ్రీవిద్య, విద్యార్థినులను అభినందించారు.
- Advertisement -



